Saturday, May 4, 2024
- Advertisement -

సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ గా ‘అనుకోని అతిథి’ ట్రైలర్ రిలీజ్

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది సాయి పల్లవి. ఈ అమ్మడు తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తుంది. కరోనా ప్రభావంతో ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా సాయి పల్లవి కీలక పాత్రలో నటిస్తున్న ‘అనుకోని అతిథి’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాను తెలుగులో ‘అనుకోని అతిథి’గా రీమేక్ చేసి ఓటీటీలో విడుదల చేయనున్నారు. మే 28 నుంచి ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ ట్రైలర్‌లో ప్ర‌తీ సీన్ ఉత్కంఠభరితంగా మలిచారు. మానసిక సమస్యతో బాధపడే పాత్రలో ఫిదా ఫేమ్ సాయిపల్లవి నటన ఆకట్టుకుటుంది. ఓ బంగ్లా నేప‌థ్యంలో వ‌చ్చే సీన్స్, బీజీఎం సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశాయి.

ఈ చిత్రాన్ని డైరెక్టర్ వివేక్ తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, అతుల్ కుల‌క‌ర్ణి, రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌, శాంతికృష్ణ కీలక పాత్రల్లో నటించారు. సంగీతం జిబ్రాన్ అందించాడు. సాయి పల్లవి డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనుండటంతో సినిమా చూడాలనే ఆతృత పెంచేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -