Monday, May 13, 2024
- Advertisement -

మూడేళ్ళ కి గానీ కోలీవుడ్ గుర్తు రాలేదా?

- Advertisement -

మలయాళం ‘ప్రేమమ్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ ‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. మొదటిసారిగా ఈమె కోలీవుడ్ లో 2016 లో ధనుష్ హీరోగా నటించిన ‘కోడి’ సినిమా తో పరిచయమైంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీ అయిపోయిన అనుపమ పరమేశ్వరన్ కోలీవుడ్ వైపు చూడలేదు. దాదాపు తన మొదటి సినిమా విడుదలైన మూడేళ్ల తర్వాత తన రెండవ సినిమాను ఈ మధ్యనే సైన్ చేసింది ఈ బ్యూటీ. తాజా సమాచారం ప్రకారం అనుపమ పరమేశ్వరన్ తమిళ హీరో అధర్వ మురళి సరసన ఒక ఒక సినిమాలో నటించనుంది.

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఒక భరతనాట్యం డాన్సర్ గా కనిపిస్తుందని సమాచారం అందుతోంది. మరోవైపు అధర్వ పి హెచ్ డి స్కాలర్ పాత్రలో కనిపిస్తారట. కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 15 నుండి మొదలు కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ అమెరికా లేదా ఆస్ట్రేలియాలో జరుగుతుంది. అనుపమ పరమేశ్వరన్ తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన ‘రాక్షసుడు’ అనే సినిమాలో కనిపించబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -