Tuesday, April 30, 2024
- Advertisement -

అనుష్క వ‌చ్చింది.. సంద‌డి తెచ్చింది

- Advertisement -

‘భాగ‌మ‌తి’ జైత్ర‌యాత్ర షురూ

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో రాణిస్తూ మెరుస్తున్న న‌టి అనుష్క ఈసారి ‘భాగ‌మ‌తి’ థియేట‌ర్‌ల‌లోకి వ‌చ్చింది. ఈ సినిమా విడుద‌లై అన్ని ప్రాంతాల్లో సూప‌ర్‌గా ఆడుతోంది. సూప‌ర్ హిట్ అందుకోవ‌డంతో ఆ సినిమా బృందం త‌మ అభినంద‌న‌ల యాత్ర ప్రారంభించింది. విజ‌య‌వాడ‌, ఏలూరు, రాజ‌మండ్రి ప‌ట్ట‌ణాల్లో చిత్ర బృందం సోమ‌వారం (ఫిబ్ర‌వ‌రి 5) తిరిగారు. థియేట‌ర్‌ల‌లో ప్రేక్ష‌కుల మ‌ధ్య సినిమా చూస్తూ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు.

ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించి సినిమా ఎలా ఉంది అని అడిగారు. ఇక సినిమాలో హైలెట్ డైలాగ్ ఇది భాగ‌మ‌తి అడ్డ రా అనే డైలాగ్‌న‌ను ప‌లుసార్లు ప్రేక్ష‌కుల విన‌తి మేర‌కు ప‌ల‌కారు. జి. అశోక్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో యూవీ క్రియేష‌న్స్ (వంశీ, ప్రమోద్) నిర్మాణంలో ‘భాగ‌మ‌తి’ జ‌న‌వ‌రి 26వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు ఎస్ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ అందించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -