హీరోయిన్ అనుష్క శర్మ సంచలన కామెంట్స్ చేసింది.తన రియల్ లైఫ్ భర్త కన్నా రీల్ లైఫ్ వరుణ్ ధావన్ తోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్లు బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ చెప్పుకొచ్చింది.అనుష్క శర్మ, వరుణ్ ధావన్ హీరో ,హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సూయీ ధాగా’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ.. సినిమా విశేషాలతోపాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా వివరించారు.
నేను పదిహేనేళ్ల వయసు నుంచే సంపాదిస్తున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నా పనిని కొనసాగిస్తున్నా. ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అయితే ఈ సినిమా మరో కొత్త విషయం నేర్పింది. ఇక నా పెళ్లి తరువాత కోహ్లి కన్నా ఈ సినిమాలో హీరో వరుణ్ ధావన్తోనే ఎక్కువ గడిపినట్లు తెలిపింది.ఈ సినిమా తనను మరో మెట్టు పైకి తీసుకువెళ్లుతుందని,సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని అనుష్క శర్మ ధీమా వ్యక్తం చేసింది.