Friday, April 26, 2024
- Advertisement -

రివెంజ్ డ్రామాలో దేవసేన

- Advertisement -

గత ఏడాది ‘భాగమతి’ అనే సినిమాతో బాక్సాఫీసు బద్దలు కొట్టిన అనుష్క శెట్టి తాజాగా తన తదుపరి సినిమా పై దృష్టి పెట్టింది. ఆర్ మాధవన్ హీరోగా ‘సైలెన్స్’ అనే సినిమాలో నటిస్తోంది అనుష్క. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి అవలేదు కానీ అప్పుడే మరొక సినిమాను లైన్లో పెట్టేసింది అనుష్క. అయితే ఈ సినిమా ఒక రీమేక్ అని వార్తలు బయటకు వస్తున్నాయి.

అసలు కథలోకి వెళితే అనుష్క కబీర్ లాల్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకుంది. ఈ చిత్రం స్పానిష్ సినిమా ‘జులియస్ అయిస్’ అనే సినిమాకి రీమేక్ అని కొందరు చెబుతున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైపోయాయి. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. రివెంజ్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అనుష్క డ్యూయల్ రొల్ పోషించబోతోంది అని తెలుస్తోంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -