Thursday, April 25, 2024
- Advertisement -

సినీ పరిశ్రమపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

- Advertisement -

సినీ పరిశ్రమకు సంబంధించి ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినీ స్టూడియోల నిర్మాణం, షూటింగుల కోసం విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూ సేకరణకు నడుంబిగించింది. ఈ మేరకు ప్రత్యేకంగా భూనిధి ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు సమాచారం. అలా సేకరించిన భూములను చలనచిత్ర అభివృద్ధి సంస్థకు అప్పగించనుంది.

భూ సేకరణ పూర్తయిన తర్వాత నిర్మాణం-నిర్వహణ-బదిలీ విధానంలో స్టూడియోలను నిర్మించేందుకు బిడ్లను ఏపీ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. అంతేకాకుండా, స్టూడియోలు నిర్మించేందుకు ముందుకొచ్చే ప్రైవేటు వ్యక్తులకు కూడా భూములు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సినిమా టికెట్ల ధరల ఖరారుపై ఏపీ ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ ఈ నెల 14న చివరిసారి సమావేశం కానుంది.

ఈ భేటీలో ఖరారు చేయనున్న నివేదిక ఆధారంగా ఈ నెలాఖరులో టికెట్ల ధరలపై జీవోను జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఐదు ఆటల విధానంలో ఉదయం 8 గంటలకు తొలి ఆట, రాత్రి 8 గంటలకు చివరి ఆట ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -