Friday, May 3, 2024
- Advertisement -

కొత్త అవ‌తారం ఎత్తిన ‘అర్జున్‌రెడ్డి’

- Advertisement -

వ‌చ్చిన అవ‌కాశాల‌ను క్యాష్ చేసుకొని కెరీర్‌ను బాగా ఉన్న‌తంగా తీర్చుదిద్దుకునే ఆలోచ‌న‌లో ‘అర్జున్‌రెడ్డి’ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్నాడు. అత‌డు ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాల‌తో టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మారాడు. ఆ రెండు సినిమాల‌తో ప్ర‌స్తుతం విజ‌య్‌కు వ‌రుస సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. దాదాపు అర డ‌జ‌న్‌కు పైగా సినిమా అవ‌కాశాలు విజ‌య్ చేతిలో ఉన్నాయి. అయితే వీటితోపాటు విజ‌య్ మ‌రో కొత్త అవ‌తారం ఎత్తుతున్నాడు.

‘అర్జున్‌రెడ్డి’ ఇచ్చిన కిక్ త‌ర్వాత విజయ్ నటిస్తున్న సినిమా ‘టాక్సీవాలా’. ఈ సినిమా మే 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌స్తున్నారు. డిఫరెంట్ హర్రర్ నేప‌థ్యంలో ఈ సినిమా తీస్తుండ‌గా దీనికి విజ‌య్ డిస్ట్రిబ్యూటర్‌గా అవ‌తారం ఎత్తాడు. టాక్సీవాలా ఓవర్సీస్ హక్కులు విజయ్ దేవరకొండ రూ.70 నుంచి 80 లక్షల మధ్యలో కొన్నాడ‌ని స‌మాచారం.

ఈ సినిమాను వేగంగా పూర్తి చేశారు. అయితే కేవ‌లం రూ.3 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు. పెళ్లిచూపులు సినిమా తరువాత విజయ్‌ను తీసుకోవ‌డంతో విజ‌య్ అప్ప‌టి రేటుకు అనుగుణంగా కేవ‌లం రూ.30 లక్షలు పారితోష‌కంగా తీసుకున్నారు. దీంతో త‌న క్రేజీ మార‌డంతో ఈ సినిమాతో క్యాష్ చేసుకోవాల‌ని భావించి డిస్ట్రిబ్యూట‌ర్‌గా మారాడు. ఈ సినిమాకు శాటిలైట్, డిజిటల్ హక్కులు అమ్మేసి ఆ డబ్బులతో సినిమాను పూర్తి చేశారు.

ఈ సినిమాను బన్నీవాసు, యువీ క్రియేష‌న్స్‌ వంశీ, దర్శకుడు మారుతి వెనుక ఉండి నిర్మించారు. నిర్మాతగా ఎస్‌కేఎన్ వ్యవహరించారు. ఈ సినిమాను రాహుల్ సంక్రీత్యాన్ దర్శకత్వం చేస్తున్నాడు. రూ.80 లక్షలతో కొన్న విజ‌య్ ఓవర్సీస్‌లో సినిమాను భారీగా రిలీజ్ చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో పరశురాం దర్శకత్వం ఓ సినిమా చేస్తున్నాడు. వీటితో ఇంకా ఐదారు సినిమాలు చేతిలో ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -