బిగ్ బాస్ సీజన్ వచ్చిందంటే తెలుగు బుల్లితెర మీద ఓ హడావుడి మొదలవుతుంది. చాలా మంది ఈ షో కోసం ఎదురుచూస్తుంటారు. బిగ్బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5న ప్రారంభం కాబోతున్నదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సారి హోస్ట్గా ఎవరు వ్యవహరించబోతున్నారు. బిగ్బాస్ హౌస్లోకి ఎవరెవరు వెళ్తున్నారు? అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి.
బిగ్బాస్ 1లో జూనియర్ ఎన్టీఆర్, బిగ్బాస్ 2లో నాని, ఇక 3, 4 సీజన్లలో అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి కూడా నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తారని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ నాగార్జున షూటింగ్లో బిజీగా ఉండటంతో ఆయనకు కుదరడం లేదట. దీంతో దగ్గుపాటి రానా హోస్ట్గా వ్యవహరించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక బిగ్బాస్ లోకి వెళ్లేందుకు కొందరు యాంకర్లు, సీరియల్ నటులు, యూట్యూబ్ స్టార్స్ తెగ ఆరాటపడుతున్నారట. గత ఏడాది హౌస్లోకి వెళ్లిన అరియానా, అవినాశ్ ఫుల్ ఫేమస్ అయిపోయారు. దీంతో ఆ సారి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు యూట్యూబ్ స్టార్లు ఆరాటపడుతున్నారు. యూట్యూబ్ నటుడు షణ్ముఖ్ జస్వంత్, నటి సురేఖావాణి, మహాతల్లి జాహ్నవి, టిక్టాక్ స్టార్ దుర్గారావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బిగ్బాస్ టీం వీళ్లను సంప్రదించినట్టు సమాచారం. ఇక ఈ షోకు ఎవరు ఫైనల్ అవుతారో? వేచి చూడాలి.
Also Read