Tuesday, April 30, 2024
- Advertisement -

‘జగదేకవీరుడు అతిలోక సుందరి’లో చిరు రెమ్యునరేషన్ ఎంతంటే ?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన చిత్రం ‘జగదేక వీరుడు -అతిలోక సుందరి’. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ మూవీ వచ్చి 30 ఏళ్లు అవుతోంది. తాజాగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. ఈ సినిమాలో నటించిన చిరంజీవి, శ్రీదేవిల పారితోషికం ఎంతో చెప్పారు.

ఈ సినిమా ద్వారా తనకు వచ్చిన లాభం కూడా చెప్పుకొచ్చాడు. ‘జగదేక వీరుడు -అతిలోక సుందరి’ సినిమాకు గాను అప్పట్లోనే చిరంజీవికి తాను రూ.35 లక్షల పారితోషకం ఇచ్చినట్లు అశ్వినీదత్ వెల్లడించారు. ఇక స్టార్ హీరోలతో సమానమైన ఇమేజ్ ఉన్న శ్రీదేవికి ఏకంగా రూ.25 లక్షల పారితోషకం ఇచ్చినట్లు వెల్లడించారు. అన్ని ఖర్చులు పోను తనకు ఈ సినిమాకి రూ.35 లక్షలు మిగిలిందని అశ్వినీదత్ వెల్లడించారు.

అయితే ఈ మొత్తం ఇప్పుడు చిన్నమొత్తం కానీ.. ఆ సమయంలో కొన్ని కోట్ల విలువైనది. ఈ లెక్కన డబుల్ ఆదాయం వచ్చిన ఈ చిత్రం బంపర్ బ్లాక్ బస్టర్ అన్నట్టే. ఇప్పటితో పోలిస్తే వందల కోట్లపైనే లాభం వచ్చినట్టు. ఇక ఆ టైంలో ఈ సినిమా ఏకంగా రూ.7 కోట్ల షేర్ వసూలు చేసిందట. తన దగ్గర ఉన్న మొత్తం డబ్బును పెట్టి తీసిన ఈ సినిమా తనను నిలబెట్టిందని.. అప్పట్లో బాల్కనీ టికెట్ రేట్ రూ.6 రూపాయలని అశ్వినీదత్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -