Friday, May 3, 2024
- Advertisement -

ఈ వార్త వింటే అ! అనాల్సిందే

- Advertisement -

బాల‌కృష్ణ‌, చిరంజీవి మ‌ల్టీస్టార‌ర్ సినిమా నాని డైరెక్ట‌ర్‌

మంచి సందేశాత్మ‌క‌.. విభిన్న షాట్ ఫిల్మ్స్‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ నానిని ఆక‌ట్టుకున్నాడు. నాని నిర్మాణంలో ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా మారాడు. తొలి సినిమా అ! భారీగా తెర‌కెక్కించాడు. విభిన్న క‌థాంశంతో చాలా మంది న‌టీన‌టుల‌తో తీసిన అ సినిమా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. నాని, ప్ర‌శాంత్‌వ‌ర్మ‌ల న‌మ్మ‌కం నిజ‌మైంది.

నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా అ!తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ప్ర‌శాంత్ వ‌ర్మ ఇప్పుడు ఓ భారీ సినిమాను తెర‌కెక్కించే ఆలోచ‌న‌లో ఉన్నాడు. టాలీవుడ్‌లో ఇద్ద‌రు అగ్ర న‌టుల‌ను క‌లిపి సినిమా చేయ‌నున్నాడ‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకు విశ్లేషకుల నుంచి మంచి స్పందన రావ‌డంతో ఇప్పుడు త‌ర్వాతి సినిమాను భారీగా తీసే ఆలోచ‌న ఉంద‌ని అ! సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో చెప్పాడు. తొలి సినిమానే అద్భుతంగా తీయ‌డంతో ఇప్పుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో సినిమా చేయ‌డానికి చాలా మంది ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.

తనకు ఓ భారీ మల్టీస్టారర్‌ చేయాలనే కోరికను ఇప్పుడు నెర‌వేర్చుకునేట‌ట్టు చూస్తున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి, నంద‌మూరి బాలకృష్ణతో క‌లిపి మల్టీస్టారర్ తీయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా సినిమా కోసం క‌థ సిద్ధం చేస్తున్నాడు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడూ.. అనేది తెలియాల్సి ఉంది. బాల‌కృష్ణ‌, చిరంజీవి ఈ సినిమాకు అంగీక‌రిస్తారో లేదో వేచి చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -