ఈ మధ్య పలువురు సెలబ్రిటీలు క్యాన్సర్తో బాధపడుతున్న సంగతి తెలిసిందే.హీరోయిన్ సోనాలి బింద్రే ఇప్పటికే ఈ క్యాన్సర్ భారిన పడి చికిత్స తీసుకుంటున్నారు.తాజాగా మరో సెలబ్రిటీ ఈ క్యాన్సర్ బాధపడినట్లు తెలుస్తుంది.బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ తాను క్యాన్సర్తో బాధ పడుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయాన్ని ఆమె స్యయంగా రివీల్ చేశారు.
తనకు రొమ్ము క్యాన్సర్ సోకిందని, ప్రస్తుతం మొదటి దశలో ఉందని తహీరా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసింది.అయితే ఇది చాలా చిన్న విషయం అని ,దీని గురించి ఆలోచించి కుంగిపోవాల్సిన పని లేదని, దయచేసి ఎవరూ ఆందోళన చెందవద్దని తన శ్రేయోభిలాషులను కోరారు.క్యాన్సర్కు చికిత్స తీసుకుంటునని తెలిపింది తహీరా.స్టేజ్ 1లో ఉన్నా, ఇప్పటికి ఆరు సెషన్లు పూర్తయ్యాయి. ఇంకో ఆరు మిగిలి ఉన్నాయని చెప్పుకొచ్చింది ఈ హీరో భార్య.
https://www.youtube.com/watch?v=UWt-TOxyhw8