మల్టీస్టారర్ ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో ఇదే ట్రెండ్. కొద్ది సంవత్సరాల క్రితం వరకు బాలీవుడ్కే పరిమితమైన ఈ ట్రెండ్ ప్రస్తుతం దక్షిణాదికి పాకింది. ముఖ్యంగా టాలీవుడ్లో మల్టీస్టారర్,బయోపిక్ల ట్రెండ్ నడుస్తుండగా కథ నచ్చితే చాలు హీరోలు ఎవరితో నటించేందుకైనా ఓకే చెబుతున్నారు. రామ్ చరణ్తో ఎన్టీఆర్ నటించడం కూడా సాధ్యమైందంటే హీరోల బిహేవియర్లో ఎంతమార్పు వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా మహానటితో బయోపిక్ల హవా పెరిగిపోగా మల్టీస్టారర్ల ట్రెండ్ కూడా పెరిగిపోయింది. అలా ఇప్పటివరకు వచ్చిన మల్టీస్టారర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ – చిరంజీవి హీరోలు మల్టీస్టారర్ రాబోతుందట. ఒకవేళ ఇదే నిజమైతే నందమూరి, మెగా ఫ్యాన్స్కు పండగే. ఎందుకంటే కొద్దిరోజులుగా ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే బాక్సాఫీస్ వారే కాదు ఫ్యాన్స్ కూడా కొట్టుకునే వరకు వెళ్తారు. అయితే తాజాగా వీరిద్దరు కలిసి నటిస్తున్నారన్న వార్త ఫ్యాన్స్కి కిక్కేస్తోంది.
గతంలో మంచి కథ దొరికితే, బాలయ్యతో కలిసి నటించడానికి తాను సిద్ధమే అని చాలా సార్లు చిరంజీవి చెప్పారు. అలాగే, బాలయ్య కూడా. దీని వెనుక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. యువ దర్శకుల టీమ్ ఒకటి కథపై సీరియస్గా వర్క్ చేస్తున్నారని… ఒకవేళ అన్ని సెట్ అయితే, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వుండొచ్చని తెలుస్తోంది. మరి దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వేచిచూడాలి..