Saturday, April 20, 2024
- Advertisement -

దారుణం.. అతీ శక్తుల కోసం కన్నబిడ్డలనే కడతేర్చేయత్నం!

- Advertisement -

ప్రపంచం టెక్నాలజీ రంగంలో ఎంత ముందు అడుగు వేస్తున్నా.. కొంత మందిలో ఉండే మూఢ విశ్వాసాలు మాత్రం పోవడం లేదు. మనిషి చనిపోయిన తర్వాత బ్రతుకుతాడని.. మంత్రాలు, యంత్రాలు తమ జీవితాలను మారుస్తాయని ఇప్పటికీ కొంత మంది నమ్ముతుంటారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో మూఢ విశ్వాసంతో ఇద్దరు కుమార్తెలను తల్లిదండ్రులు హతమార్చడం ఇటీవల సంచలనమైన విషయం తెలిసిందే. ఈ ఘోరం మర్చిపోకముందే.. అలాంటి సంఘటనే తమిళనాడులో వెలుగు చూసింది. కాకపోతే ఇక్కడ చిన్నారులు ఇద్దరూ చాకచక్యంగా తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. స్థానిక రైల్‌నగర్‌కు చెందిన రామలింగం (42), రంజిత (32) భార్యాభర్తలు. వీరికి దీపక్ (15), కిషాంత్(6) సంతానం. చీరల వ్యాపారం చేసే రామలింగం.. ఇందుమతిని రెండో వివాహం చేసుకుని అదే ప్రాంతంలోని వేరే ఇంట్లో ఉంచాడు. ఈ క్రమంలోనే ఇందుమతికి ధనలక్ష్మితో పరిచయం అయ్యింది. ఈ పరిచయం శృతిమించి వారు ఇద్దరు వివాహం చేసుకుంటామని రామలింగంతో చెప్పారు. మీరిద్దరూ శివపార్వతుల్లా ఉన్నారని చెప్పి రామలింగం కూడా అంగీకరించాడు.

కుమారుల ఎదుట ఇంట్లోనే వారిద్దరికీ వివాహం చేశాడు. అతీతశక్తులు వస్తాయన్న నమ్మకంతో ధనలక్ష్మిని నాన్న అని, తండ్రి రామలింగాన్ని మామ అని పిలవాలని కుమారులను చిత్రహింసలకు గురిచేసేవారు. అంతే కాదు ఆ పిల్లలను దేవతలకు బలి ఇస్తే తమకు అతీంద్రశక్తులు వస్తాయని చంపడానికి ప్లాన్ వేశారు. ఈ విషయం ఆ ఇద్దరు చిన్నారులు తెలుసుకొని పారిపోయి తమ తాతయ్య వద్దకు చేరుకొని అసలు విషయం చెప్పారు. ఆ పిల్లల తాతయ్య పోలీసు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంజిత, ధనలక్ష్మి, రామలింగాన్ని అదుపులోకి తీసుకున్నారు.

శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగం.. రాశీ ఫలాలు!

పరీక్షలు వద్దు.. తేల్చి చెప్పిన సీఎం సర్..!

ఉగ్రరూపంగా బాలయ్య ‘అఖండ’ టీజర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -