- Advertisement -
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం భరత్ అను నేను సినిమా మరో మైలురాయి చేరింది.ఈ సినిమా 200 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాత డివివి దానయ్య వెల్లడించారు.సినిమా విడుదలై మూడు వారాలు అయింది. ఈ సందర్భంగా రీలిజ్ చేసిన పోస్టర్లో ఈ విషయన్ని తెలియజేశారు.తొలిరోజే రూ. 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని నిర్మాత ప్రకటించారు.
మొదటి వారంలో రూ.161 కోట్లు, రెండు వారాలకు రూ. 190 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్నట్టు వెల్లడించారు.మూడు వారాల్లో రూ.205 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది.మహేష్ ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్లో బిజిగా ఉన్నాడు తరువాత సినిమా సుకుమార్ డైరక్షన్లో చేస్తున్నాడు మహేష్.