Thursday, March 28, 2024
- Advertisement -

ఓటీటీలో భీమ్లానాయక్… ఎప్పటి నుంచి అంటే ?

- Advertisement -

పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్​, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా​ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సినిమా గురించే చర్చ సాగుతోంది. రీమేక్​ మూవీ అయినప్పటికీ.. అంచనాలకు మించి సినిమా ఉన్నట్లు అభిమానులు చెబుతున్నారు.

థియేటర్లలో భీమ్లా నాయక్ సందడి నడుస్తుండగానే.. మరోవైపు ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో భీమ్లానాయక్​ నిర్మాతలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఆహా ఓటీటీ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం మార్చి చివరి వారంలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయొచ్చని సమాచారం.

ఇక భీమ్లా నాయక్ డబ్బింగ్ వెర్షన్‌ను ‘డిస్నీ ప్లస్​ హాట్‌స్టార్​’ దక్కించుకున్నట్లు టాక్ నడుస్తోంది. తెలుగు ఒరిజినల్‌​తో పాటు.. హీందీ డబ్బింగ్ వెర్షన్‌కు భారీ ధర చెల్లించినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తం మీద భీమ్లా నాయక్ మూవీ నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోసారి రిపీట్ కాబోతున్న హిట్ పెయిర్

దుమ్మురేపుతున్న నాటు సాంగ్

మహేశ్ బాబు అభిమానుల్లో కొత్త భయాలు.. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -