Thursday, April 25, 2024
- Advertisement -

మరోసారి రిపీట్ కాబోతున్న హిట్ పెయిర్

- Advertisement -

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే, యంగ్ హీరో నాగ చైతన్య మళ్లీ జతకట్టబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పూజా హెగ్డే తొలి చిత్రం ఒక లైలా కోసంలో కథనాయకుడు నాగచైతన్యే కావడం విశేషం. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్డే దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె ‘ఆచార్య’ చిత్రంలో రామ్‌చరణ్‌, తమిళ చిత్రం ‘బీస్ట్‌’లో విజయ్‌ సరసన నటిస్తోంది.

ఇటీవల ఘన విజయం సాధించిన తమిళ చిత్రం ‘మానాడు’కి దర్శకత్వం వహించిన వెంకట్‌ ప్రభు.. నాగచైతన్యతో ఓ సినిమా ప్లాన్‌ చేశారు. ఆయనకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. కాగా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేనే సూట్‌ అవుతుందని వెంకట్‌ ప్రభు భావిస్తున్నారట. ఈమేరకు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు.

‘మానాడు’ చిత్రాన్నే నాగచైతన్యతో రీమేక్‌ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కాదు మరో కొత్త కథతో రాబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో నిజమెంటన్నది చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మహేశ్ బాబు అభిమానుల్లో కొత్త భయాలు.. వారి అనుమానాలు నిజమవుతాయా ?

భీమ్లానాయక్ సినిమా ఎలా ఉందంటే ?

దుబాయ్‌‌లో ఆర్‌ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్… చీఫ్ గెస్ట్‌‌గా హాలీవుడ్ స్టార్ హీరో

మహేశ్‌కు విలన్‌గా విక్రమ్… మ్యాజిక్ చేయబోతున్న త్రివిక్రమ్

మహా మాయగాడి ఉచ్చులో బాలీవుడ్ భామలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -