Sunday, May 19, 2024
- Advertisement -

కౌశ‌ల్‌ను కెప్టెన్ కాకుండా అడ్డుకోగ‌లరా..?

- Advertisement -

బిగ్‌బాస్ హోస్‌లో గ‌త మూడు రోజులుగా జ‌రుగుతున్న కాల్ సెంట‌ర్ టాస్క్ గురువారంతో ముగిసింది.ఈ టాస్క్‌లో హోస్‌లోని స‌భ్యులు రెండు టీం లుగా విడిపోయి గేమ్ ఆడిన సంగ‌తి తెలిసిందే. ఒక గ్రూప్‌కు కౌశ‌ల్ లీడ‌ర్‌గా ఉండ‌గా ,రెండో గ్రూప్‌కు త‌నీష్ నాయ‌కత్వం వ‌హించాడు.ఇక కాల్ సెంట‌ర్ టాస్క్‌లో విజ‌యం సాధించింది కౌశ‌ల్ టీం.వీరికి ఈ గేమ్‌లో ప‌ది పాయింట్లు రాగా,త‌నీష్ టీంకు 7 పాయింట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.కాల్ సెంట‌ర్ టాస్క్‌లో గేమ్ బాగా ఆడిన కౌశ‌ల్‌,రోల్ రైడాలు ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌కు ఎంపిక అయినట్లు బిగ్‌బాస్ ప్ర‌క‌టించాడు.

వీరి మధ్య కెప్టెన్సీ టాస్క్ ఈ రోజు(శుక్ర‌వారం) జ‌ర‌గ‌నుంది.షో మొద‌టి నుండి కౌశ‌ల్‌కు వ్య‌తిరేకంగా హోస్‌మెట్స్ అంద‌రు ఉంటు వ‌స్తున్నారు. దీని కార‌ణంగానే అత‌ను ఒక్కసారి మాత్ర‌మే కెప్టెన్ కాగ‌లిగాడు.ఇక ఈ రోజు జ‌ర‌గ‌నున్న కెప్టెన్ టాస్క్ గేమ్‌లో కూడా అంద‌రు కౌశ‌ల్‌నే టార్గెట్ చేశార‌ని ఈ రోజు(శుక్ర‌వారం) విడుద‌ల చేసిని ప్రొమోని చూస్తే అర్థం అవుతుంది.కెప్టెన్ టాస్క్‌లో భాగంగా కౌశ‌ల్‌,రోల్ రైడాల‌కు ప‌డ‌గొట్టు,నిల‌బెట్టు అనే టాస్క్‌ను ఏర్పాటు చేశారు.ఇద్ద‌రికి కొన్ని క్యూబ్స్ ఇచ్చారు. ఒక టెబుల్‌పై వారు ఈ క్యూబ్‌స్‌ని నిల‌బెట్టాలి.హోస్‌మెట్స్ వాటిని బంతుల‌తో ప‌డ‌గొడుతు ఉండాలి. చివ‌రికి ఎవ‌రు ఎక్కువ క్యూబ్స్ నిల‌బెడ‌తారో వారు విజేత‌గా నిలుస్తారు.

అయితే ఇక్క‌డ హోస్‌మెట్స్ అంద‌రు కౌశ‌ల్‌నే టార్గెట్ చేశారు.ఎక్కువ మంది కౌశ‌ల్ టెబుల్‌నే టార్గెట్ చేసుకుని బంతుల‌ను విస‌ర‌డం ప్రొమోలో క‌నిపిస్తుంది.త‌నీష్‌,దీప్తి సునైనా,గ‌ణేష్‌,అమీత్ ఇలా అంద‌రు కౌశ‌ల్‌నే టార్గెట్ చేసుకుని అత‌ని టెబుల్‌పై ఉన్న క్యూబ్స్‌ని ప‌డ‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.మ‌రి వీరి ప్ర‌య‌త్నం ఫలిస్తుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -