శనివారం బిగ్బాస్ హౌస్లోకి న్యాచురల్ స్టార్ నాని ఎంట్రీ ఉండటంతో బుల్లి తెర ప్రేక్షకులు ఆసక్తిగా ఈ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక పది వారాలు సక్సెస్ ఫుల్గా కంప్లీట్ చేయడంతో టైటిల్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. షో ప్రారంభంలో గత 11 రోజులుగా భారీ వర్షాల ధాటికి చిగురుటాకులా వణికిపోతున్న కేరళ రాష్ట్ర ప్రజలకు తమ వంతు సాయం చేయాల్సిందిగా బిగ్ బాస్ స్టేజ్ నుండి పిలుపినిచ్చారు నాని. అనంతరం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో నాని టీవీ ద్వారా ముచ్చటించారు నాని.
తొలిత భారత మాజీ ప్రధాని వాజ్ పేయి మరణానికి ఒక నిమిషం పాటు కంటెస్టెంట్స్తో కలిసి మౌనం పాటించారు. ఇక ఈవారం ఎలిమినేషన్ జోన్లో ఉన్న గీతా మాధురి, శ్యామల, రోల్ రైడా, పూజా, నూతన్ నాయుడు, దీప్తి సునయనలలో గీతా మాధురి, శ్యామలలు సేఫ్ అయినట్టు తెలిపారు నాని. ఇక నూతన్ నాయుడు గాయం కారణంగా బిగ్ బాస్ హౌస్ను వీడటంతో రేపటి ఎపిసోడ్లో రోల్ రైడా, పూజా, దీప్తి సునయనలలో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారు.