Tuesday, April 30, 2024
- Advertisement -

బిగ్‌బాస్ వ‌ల్ల కాపురాలు కూలిపోయ్యేలా ఉన్నాయిగా..!

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మొద‌టి నుంచి వివాద‌ల‌తో న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే.షో మొద‌టి నుంచి హౌస్‌మెట్స్ మ‌ధ్య త‌ర‌చు గొడ‌వ‌లు,వివాదాలు జ‌రుగుతునే ఉన్నాయి.హౌస్‌మెట్ తేజ‌స్వీ బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేష‌న్ అయిన త‌రువాత ఈ గొడ‌వ‌లు కాస్తా త‌గ్గుముఖం ప‌ట్టాయి.ఇక షోలో స‌రికొత్త అంకానికి తెర లేపింది సింగ‌ర్ గీతా మాధురి.గీతా మాధురి ప్ర‌వ‌ర్త‌న‌లో గ‌త రెండు వారాలుగా మార్పు వ‌చ్చింది.ఆమె హౌస్‌మెట్ అయిన సామ్రాట్‌తో చాలా క్లోజ్‌గా ఉంటూ వ‌స్తుంది.మొదట్లో తనీష్-సునైనా, ఆ తరువాత సామ్రాట్-తేజస్వి, తనీష్-నందిని ల రొమాంటిక్ ట్రాక్ లు నడిచాయి. ఇప్పుడు నందిని, సునైనా, తేజస్వి ఎలిమినేట్ కావడంతో ఆ బాధ్యతల్ని సామ్రాట్-గీతామాధురి తీసుకున్నట్లుగా ఉన్నారు.

రోజు రోజుకి వీరి బంధం బ‌ల‌ప‌డుతుంద‌నే చెప్పాలి.చూపుల యుద్ధంతో మొదలైన వీరి ట్రాక్ ముద్దుల వరకు వచ్చేసింది. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో సామ్రాట్, గీతాని ముద్దు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి రోల్ రైడా.. గీతామాధురికి ముద్దు పెట్టాలనేది టాస్క్. రోల్ కి ఈజీ అవ్వడం కోసం సామ్రాట్ ముందుగా గీతకు ముద్దుపెట్టాడు. దీంతో సోషల్ మీడియాలో గీతామాధురిపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.బిగ్ బాస్ షో ఆరంభంలో ఎంతో మెచ్యూర్డ్ గా వ్యవహరించిన గీతా రాను రాను ఈ విధంగా ప్రవర్తించడం ప్రేక్షకులకు రుచించడం లేదు. ఇక బిగ్‌బాస్ వంటి షోల వ‌ల్ల కాపురాలు కులిపోయ్యేలా ఉన్నాయాని కొంద‌రు భావిస్తున్నారు.మ‌రి వీరి బంధం ఎంత దూరం వెళ్లుతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -