బిగ్బాస్ రెండో సీజన్ మరో రెండు వారాలలో ముగియనుంది.బిగ్బాస్ విన్నర్ ఎవరు అవుతారని సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక నిన్న(ఆదివారం) జరిగిన ఎలిమినేషన్లో హౌస్లోకి కామన్మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు,గణేష్లు బయటికి వచ్చేశారు.ఇక బిగ్బాస్ హౌస్లో మిగిలింది ఎనిమిది మంది మాత్రమే.మరి వీరిలో ఎవరు విన్నర్ అవుతారో చూడాలి అంటే ,మరో రెండు వారాలు ఆగాల్సిందే.
తాజాగా బిగ్బాస్ విన్నర్ ఎవరు అవుతారో చెప్పింది బిగ్బాస్ కంటెస్టెంట్ పూజా రామచంద్రన్.వైల్డ్ కార్డు ద్వారా బిగ్బాస్ హౌస్లోకి అడుగు పెట్టిన పూజా మూడో వారంలోనే హౌస్ నుంచి ఎలిమినేషన్ అయి బయటికి వచ్చేసింది.ఆమె తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు బిగ్బాస్లో తన అనుభవాలను ప్రేక్షకులతో పంచకుంది.నేను బయట చూసిన దానికి లోపల చూసిన దానికి చాలా తేడాగా ఉందని తెలిపింది పూజా.హౌస్మెట్స్ అందరు గేమ్ బాగా ఆడుతున్నారని,ఫస్ట్లో కౌశల్ గేమ్ తనకు తెలియలేదని,తరువాత అతని గేమ్ని గమనించనాని చెప్పుకొచ్చింది.హౌస్లో చాలా మంది రిలేషన్షిప్ మెయిన్టైన్ చేస్తున్నారని,కాని కౌశల్ అలా కాదని అతను గేమ్ ఆడటానికి వచ్చానని ,గేమ్ మాత్రమే ఆడతానని తన వైఖరిని తెలిపాడని చెప్పుకొచ్చింది.
కౌశల్ ఆడుతున్న గేమ్లో నిజాయితి ఉందని నేను నమ్మతున్ననని చెప్పింది.కౌశల్ బిగ్బాస్ విన్నర్ అవుతాడని నేను భావిస్తున్ననని తెలిపింది.ఇక తాను బయటికి రావడానికి హౌస్మెట్స్ ఎవరు కారణం కాదని ,నాకు తెలుగు రాకపోవడం వల్లే ప్రేక్షకులు నాకు ఓట్లు వేయలేదని ,అందుకే నేను బిగ్బాస్ హోస్ నుంచి ఎలిమినేట్ అయ్యానని పెర్కొంది పూజా రామచంద్రన్.