తెలుగు రియాల్టీ షో బిగ్బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ టీడీపీ పార్టీలో చేరారు. కౌశల్ శనివారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొద్ది రోజులుగా కౌశల్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం జరగుతోంది. ఇది నిజం అన్నట్లుగా కౌశల్ చంద్రబాబును కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రి గంటా శ్రీనివాసరావు కౌశల్ను పార్టీలో తీసుకురావాలని గత కొద్దిరోజులుగా తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఎట్టకేలకు కౌశల్ను పార్టీలోకి తీసుకురావడంలో గంటా సక్సెస్ అయ్యారు. కౌశల్ను గంటానే దగ్గరుండి చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి మరి పార్టీలో చేర్పించారు . వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కౌశల్ చేత ప్రచారం చేయించాలని భావిస్తుంది టీడీపీ పార్టీ. అయితే కౌశల్ మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలని భావిస్తున్నాడట. బాపట్ల పార్లమెంట్ నుంచి కౌశల్ కాని ఆయన భార్య నీలిమా కాని పోటీ చేయలనే ఆలోచనలో ఉన్నారట. ఎంపీ సీటు కుదురపోతే,ఎమ్మెల్యేగా అయిన పోటీ చేయడానికి రెడీ అవుతున్నారట.
టీడీపీ మాత్రం కౌశల్తో ప్రచారం చేయించి , అతని అభిమానుల ఓట్లను కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తోంది. కొద్ది రోజులు క్రితం కౌశల్ ఆర్మీలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. పౌండేషన్లో డబ్బులను కౌశల్ తన స్వార్థానికి వాడుకుంటున్నారని ఆర్మీలోని కొందరి సభ్యులు మీడియా ఛానెళ్లకు ఇంటర్య్యూలు ఇచ్చి రచ్చ రచ్చ చేశారు. ఆ సమయంలోనే కౌశల్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారనే వార్త బయటికి వచ్చింది. మరి బిగ్బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన కౌశల్ రాజకీయాల్లో ఎలా రాణిస్తారో చూడాలి. కౌశల్ త్వరలోనే మంచి రోజు చూసుకుని అధికారికంగా టీడీపీలో చేరనున్నారు.
- Advertisement -
టీడీపీలో చేరిన ‘బిగ్బాస్’ కౌశల్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -