బిగ్బాస్ రెండో సీజన్ పూర్తి అయిన తరువాత కూడా వివాదాలు వదలడం లేదు.16 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్బాస్ రెండో సీజన్లో కౌశల్ విన్నర్గా నిలిచిన సంగతి తెలిసిందే.కౌశల్ బిగ్బాస్ విన్నర్గా నిలవడాన్ని కొందరు హౌస్మెట్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.నిన్నటికి నిన్న బిగ్బాస్ ఫైనలిస్ట్ సామ్రాట్ తన దృష్టిలో బిగ్బాస్ విజేత గీతా మాధురియే అని చెప్పాడు.తేజస్వీ కూడా బిగ్బాస్ అసలైన విన్నర్ వీరేనంటూ హౌస్మెట్స్ ఫోటోని ఒకటి షేర్ చేసింది.ఈ ఫోటోలో బిగ్బాస్ విన్నర్ కౌశల్ లేకపోవడం గమనర్హం.తాజాగా బిగ్బాస్ మరో కంటెస్టెంట్ బాబు గోగినేని కూడా కౌశల్ విన్నింగ్పై కామెంట్స్ చేశారు.కౌశల్ బిగ్బాస్లోకి రావడానికి ముందే కొందరిని టీంగా ఏర్పాటు చేసుకుని వచ్చాడని,ఇది డబ్బు ఖర్చుపెట్టి గెలిచిందని కామెంట్స్ చేశాడు
బాబు గోగినేని.బాబు గోగినేని చేసిన కామెంట్స్పై బిగ్బాస్ విన్నర్ కౌశల్ స్పందించారు.ఈ విషయాన్ని గురించి కౌశల్ మాట్లాడుతూ… “ఆరోపణలు చేయడం కాదు .. ప్రూవ్ చేయాలి. నేను డబ్బులు పంచి గెలిచినట్టుగా బాబు గోగినేని నిరూపిస్తే, బిగ్ బాస్ టైటిల్ ను ఆయన చేతిలో పెట్టేసి వెళ్లిపోవడానికి సిద్ధంగా వున్నాను. 40 కోట్ల మందిని మోసం చేయడం సాధ్యమా .. కాదా అనేది ఆలోచిస్తే సరిపోతుంది. నా అభిమానులను కించపరిచేలా మాట్లాడితే మాత్రం సహించబోనని తెలిపాడు కౌశల్.