ఓటీటీలో కామెడీ పండించడానికి బిగ్ బాస్ వచ్చేస్తున్నాడు. ఇప్పటివరకు బుల్లితెరపై అలరించిన బిగ్ బాస్..ఇప్పుడు 24/7 వినోదం పంచేందుకు రెడీ అవుతున్నాడు. బిగ్బాస్ నాన్స్టాప్’ పేరుతో ప్రసారంకానున్న ఈ షోకి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ షో.. ‘డిస్నీ+ హాట్స్టార్’ ఓటీటీలో ఫిబ్రవరి 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించారు.
ప్రోమోని కాస్త డిఫిరెంట్ గా ప్లాన్ చేశారు. ఉరిశిక్ష ఖరారైన ఖైదీ తన చివరి కోరికగా బిగ్బాస్కి సంబంధించి ఒక్క ఎపిసోడ్ను చూడాలనుకుంటాడు. అయితే తన కోరిక మేరకు ఈ షోను ప్రసారం చేయగా అది ఎంతకీ పూర్తవదు. నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ నాగర్జున చివర్లో షో ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేశారు.
ఈ ప్రోమోలో ఖైదీగా వెన్నెల కిశోర్, పోలీసు అధికారిగా మురళీశర్మ, లాయరుగా నాగార్జున కనిపించారు. ఇంకా ఈ షోలో ఎవరెవరు పాల్గొంటారన్న దానిపై త్వరలో వివరాలు వెలువడనున్నాయి.
రీల్ జంటలు రియల్ లైఫ్ లో ఒక్కటైన హీరో, హీరోయిన్లు..!