Saturday, May 4, 2024
- Advertisement -

మధ్యలోనే ఆగిపోయిన నితిన్ సినిమా

- Advertisement -

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న యువ హీరో నితిన్ ఇప్పుడు వరుసగా సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రష్మీక మందన్న ఈ సినిమాలో హీరోయిన్. ఇక ఈ సినిమా తర్వాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో లో ఒక సినిమా చేయనున్నాడు నితిన్. ఈ సినిమా ఇంకా మొదలు అవ్వలేదు కానీ అప్పుడే నితిన్ తన తదుపరి సినిమా అని వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించేశాడు. అయితే నితిన్-చంద్రశేఖర్ యేలేటి సినిమా ఆగిపోయిందని సమాచారం.

ఈ మధ్యనే అధికారికంగా లాంచ్ అయిన సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే రోజురోజుకు పెరిగి పోతుండటంతో నిర్మాత ఆనందప్రసాద్ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. పైగా బడ్జెట్ విషయం తేలేంతవరకు ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు అని వార్తలు వినిపించాయి కానీ అసలు ఈ సినిమా మళ్ళీ మొదలవుతుందో లేదో అని సందేహాలు రేకెత్తుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -