బ్రూస్ లీ ఎఫెక్ట్ ఒకరికి ఖేదం ఇద్దరికి మోదం అన్నట్లుగా తయారైంది. బ్రూస్ లీ రిలీజ్ కు ముందు తలలు పట్టుకున్న ఆ ఇద్దరు… ఇప్పుడు బ్రూస్ లీ టాక్ తో తెగ ఆనంద పడిపోతున్నారు.
బ్రూస్ లీ నెగిటివ్ టాక్ తో అంతలా లాభ పడిన ఆ ఇద్దరు ఎవరో కాదు. గుణశేఖర్ ,కింగ్ నాగార్జున.బ్రూస్ లీ ఫలితం ఈ బ్యాచ్ కు ఎంతో ఆనందాన్నిచ్చింది.మెగా బ్యాచ్ అంటే తమ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆనంద పడ్డారనుకోవచ్చు. మరి గుణశేఖర్ ,అఖిల్ టీం ఎందుకు ఆనంద పడుతున్నట్లు.ఇపుడు దీని గురించి పరిశ్రమలో చర్చించుకుంటున్నారు.
బ్రూస్ లీ మార్నింగ్ షోతోనే తేలిపోవడంతో గుణశేఖర్ అండ్ టీం తో పాటు దాసరి బ్యాచ్ మంచి జోష్ మీదున్నారట. బ్రూస్ లీ సినిమా టాక్ తో రుద్రమదేవికి మళ్లీ కలెక్షన్స్ ఊపందుకోవడమే దానికి కారణమని చెప్పవచ్చు.
ఒక్క గుణశేఖర్ అనే కాదు. అటు నాగార్జున టీం కూడా ఒక రకంగా ఆనందగా ఉందనే చెప్పవచ్చు. పైకి ఎంత మీకు మేము మాకు మీరు అని రాసుకు పూసుకున్నప్పటికీ….లోలోన అఖిల్ చిత్రానికి వచ్చే ఇబ్బంది లేదన్నది వారు ఉద్దేశ్యం.
ఇపుడున్న టైమ్లో అఖిల్ చిత్రం గ్రాఫిక్స్ సరిగా రాని కారణంతో వాయిదా పడింది.దాని వలన సినిమా వారం పదిరోజులు గ్యాప్ తీసుకున్నప్పటికీ…. రిలీజ్ మాత్రం ఖాయం.అయితే ఈలోపు బ్రూస్ లీ వేడి పూర్తిగా చల్లారిపోయి తమ అఖిల్ కు లైన్ క్లియర్ అయిపోతుందనే ఆశతో ఉన్నారు.బ్రూస్ లీ ప్రభావం ఓవరాల్ గా చూస్తే….. ప్రజెంట్ పర్వాలేదనే టాక్ తో నడుస్తున్నటువంటి రుద్రమదేవికి,త్వరలో వస్తామనే ధీమాతో ఉన్న అఖిల్ కు ప్లస్ గా మారింది. ఏది ఎలా ఉన్నా సేఫ్ జోన్లో రుద్రమదేవి..సేఫ్ సైడ్లో అఖిల్ చేరిపోయారు.