Friday, May 3, 2024
- Advertisement -

రచయితను కొట్టిన కృష్ణ ఫ్యాన్స్

- Advertisement -

అభిమానం అనేది మ‌న‌స్సులో ఉంటే చాలు అనేది అప్ప‌టి మాట కాని ఈ రోజుల‌లో అభిమానం హ‌ద్దు మిరిపోతుంది. హీరోల మ‌ధ్య ఆరోగ్య‌క‌మైన పోటి ఉంటుంది కాని వైరుధ్యాలు ఉండేవి కావు .కాని ఫ్యాన్స్ మాత్రం అలా కాదు వాళ్లు త‌మ హీరోనే గొప్ప అనే రీతిలో ఉండువారు.ఫాన్స్ మ‌ధ్య గొడ‌వ‌లు కొట్లాటలు జ‌రుగుతుండేవి. సీనియ‌ర్ ఎన్టీఆర్ తెలుగు చిత్రసీమ‌ను ఏలుతున్న స‌మ‌యంలోనే సూప‌ర్‌స్టార్ కృష్ణ మాస్ హీరోగా ఎదిగారు.అప్ప‌ట్లో వీరిద్ద‌రి మ‌ధ్య పోటి తీవ్రంగా ఉండుది.ఇంకా ఫ్యాన్స్ గురించి వేరే చేప్పాలా ..ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ ఎక్కువుగా ఉన్నాప్ప‌టీకి కృష్ణ కూడా అదే రీతిలో ఫ్యాన్స్ ఉండేవారు.

ఇప్పుడు అభిమానుల మధ్య వైషమ్యాలు చాలా వరకు సోషల్ మీడియాకు పరిమితం అవుతున్నాయి కానీ.. ఒకప్పుడు నేరుగా బాహాబాహీకి దిగేవాళ్లు. అప్పటి ఆ పోటీ గురించి ఇప్పుడు ప్రముఖ రచయితగా వెలుగొందుతున్న సాయిమాధవ్ బుర్రా ఒక కార్యక్రమంలో వెల్లడించాడు. తాను ఎన్టీఆర్‌కు వీరాభిమానినని.. ఐతే తాను పుట్టి పెరిగిన తెనాలిలో తానంటే కృష్ణ అభిమానులకు పడేది కాదని అతను చెప్పాడు. ఓ సందర్భంలో కృష్ణ అభిమానులు తనను కొట్టినట్లు అతను వెల్లడించాడు. ఐతే అభిమానుల మధ్య ఈ గొడవలు ఉంటాయి కానీ.. హీరోల మధ్య అలాంటివేమీ ఉండవని.. ఎన్టీఆర్-కృష్ణ చాలా సన్నిహితంగా ఉండేవారని తనకు తర్వాత తెలిసిందని సాయిమాధవ్ తెలిపాడు. కృష్ణను స్వయంగా కలుసుకున్నాక ఆయనది ఎంత మంచి మనసో తనకు అర్థమైందని అతనన్నాడు. కృష్ణ కూతురు మంజుల దర్శకురాలిగా పరిచయం కానున్న ‘మనసుకు నచ్చింది’ సినిమాకు సాయిమాధవే మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -