Saturday, May 4, 2024
- Advertisement -

శిల్పా శెట్టిపై కేసు నమోదు.. తల్లి, సోదరిపైన కూడా..

- Advertisement -

బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని కష్టాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్‌లోనూ చాలా క్రేజ్ ఉన్న ఈ నటి ఇటీవల కాలంలో తరచు వార్తల్లో నిలుస్తోంది. శిల్ప వెండి తెరపై కనిపించి చాలా కాలమే అయినా.. బుల్లితెరపై అభిమానులను అలరిస్తూ వస్తోంది. ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు వ్యక్తిగత జీవితం సాఫిగా సాగుతున్న తరుణం భర్త రాజ్ కుంద్రా అరెస్టుతో అంతా తలకిందులైంది.

అశ్లీల చిత్రాల వ్యవహారంలో రాజ్ కుంద్రా అరెస్టు కావడం శిల్పా శెట్టికి పెద్ద షాక్‌గా మారింది. చాలా కాలం పాటు ఈ వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. అప్పుడే కేసుల ఉచ్చులో పడిన శిల్పా…తాజాగా మరోసారి సమస్యల సుడిలో చిక్కుకుంది. శిల్పా శెట్టిపై ఇప్పుడు కేసు నమోదైంది. శిల్పా శెట్టి తండ్రి సురేంద్ర శెట్టి 2016 అక్టోబర్ 11న మరణించారు. కానీ అంతకంటే ముందే 2015లో సురేంద్ర శెట్టి ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని పర్హద్‌ అమ్రా దగ్గర నుండి రూ.21 లక్షలు అప్పు తీసుకున్నారు.

2017 జనవరి కల్లా ఆ రుణాన్ని చెల్లించేలా వారి మధ్య ఒప్పందం జరిగింది. కానీ మధ్యలోనే సురేంద్ర మరణించారు. సురేంద్ర శెట్టి అప్పు తీసుకున్న విషయం శిల్పా శెట్టికి, ఆమె సోదరి షమితా శెట్టి, తల్లికి కూడా తెలుసని, అయినా కూడా తిరిగి ఇవ్వడం లేదని వ్యాపారవేత్త పర్హద్‌ అమ్రా జుహూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో వారిపై కేసు నమోదైంది. ఈ నెల 28న వీరు ముగ్గురు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

పాన్ ఇండియా మూవీగా శక్తిమాన్

వివాదాస్పద సెలబ్రిటీలతో కంగనా లాక్‌అప్

పెళ్లి పై అలియా భట్ షాకింగ్ కామెంట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -