- Advertisement -
తమ అభిమాన హీరో సినిమా మొదటి రోజే చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ అలానే రానా ఫ్యాన్స్ ఆతృతగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.
వీళ్ళు మాత్రమే కాదు ప్రతి సినీ ప్రేక్షకుడు ఈ మూవీని మొదటి రోజే చూడాలని టికెట్ల కోసం చేయని ప్రయత్నం లేదు.
ఈ రకంగా బాహుబళి ఫీవర్ అందరిలోకి పాకింది. అయితే బాహుబళి టికెట్ల కోసం కొట్టుకుంటున్న నేపథ్యంలో ఒక చికెన్ సెంటర్ యజమాని ’బాహుబళి’ టికెట్లు ఫ్రీగా ఇస్తానంటూ ఏకంగా ప్లెక్సీ ఏర్పాటు చేశాడు. అయితే ఒక కండీషన్. ఏంటంటే తన షాపులో ఐదు వందల రూపాయల చికెన్ కొంటేనే టికెట్ ఫ్రీగా ఇస్తాడు. అయితే ఇది కేవలం 10,11,12 తేదీలలో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ సంఘటన నెల్లూరులో చోటు చేసుకుంది..
దీన్ని బట్టి బాహుబళి సినిమా క్రేజ్ని డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాదు ఎవరికి వారు సొంత తెలివితేటలతో వ్యాపారంగా మల్చుకుంటున్నారు. .