Thursday, May 16, 2024
- Advertisement -

కమెడియన్ ఉత్తేజ్ కుమార్తె తెరంగేట్రం

- Advertisement -

ఉత్తేజ్ గుర్తున్నాడా. అదే రాంగోపాల్ వర్మ సినిమాల్లో హల్ చల్ చేసిన నటుడు. రచయితగా కూడా అడపదడపా చిత్రాల్లో పని చేసిన ఉత్తజ్ ఈ మధ్య వెండితెరకు దూరంగానే ఉన్నారు. అయితే ఆయన కుమార్తె చేతన మాత్రం త్వరలో టాలీవుడ్ లో హీరోయిన్ గా కనిపించబోతోంది. కుర్రకారు ప్రేమకథా చిత్రం పిచ్చిగా నచ్చావ్, హర్రర్ చిత్రం షీల్లో నటిస్తున్నట్లుగా చేతన చెప్పింది.

ఇంతకు ముందు బాల నటిగా చిత్రం సినిమాలో కుక్కకావాలి అంటూ మారాం చేసే పాత్రలోనూ భద్రాచలం, బద్రీ చిత్రాల్లోనూ చేతన నటించింది. అయితే హీరోయిన్ గా మాత్రం ఇప్పుడే కనిపించబోతోంది. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లోనే నటి కావాలనుందని తన తండ్రి ఉత్యేజ్ కు చెప్పానని, దానికి ఆయన ఓకె అన్నారని చేతన చెప్పింది. మొన్నటి వరకూ హీరోల పుత్రులు తెరంగెట్రం చేస్తే ఇప్పుడు వారి కుమార్తెలు వస్తున్నారు. నాగబాబు కుమార్తె నిహారిక తెరపై కనిపిస్తూంటే రాజశేఖర్ కుమార్తె శివాని కూడా త్వరలో నటించబోతోందని తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -