మెగాస్టార్ వైపు నుంచి చర్చలు జరుగుతూ ఉన్నప్పటికీ సుకుమార్ మాత్రం ఎందుకో ఎక్కువ జాగ్రత్త తీసుకున్నాడు. తన పరిస్థితి కూడా 150వ సినిమా విషయంలో పూరీ జగన్నాథ్ పరిస్థితిలా అవ్వకూడదని మీడియాకు ఏమీ చెప్పకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అయిన వెంటనే వేరే ఏ హీరో కూడా సుకుమార్ని అప్రోచ్ అవ్వకుండా చిరంజీవి జాగ్రత్తపడ్డాడు. రంగస్థలం ఫలితం తేడా కొట్టి ఉంటే ఏం జరిగి ఉండేదో తెలియదుకానీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చిన వెంటనే సుకుమార్ని లాక్ చేశాడు మెగాస్టార్.
ఇక తాజాగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేసే నిర్మాతలు కూడా ఎవరో తెలిసిపోయింది. రంగస్థలం సినిమాను నిర్మించిన మైత్రీ మూవీమేకర్సే ఈ సినిమాను కూడా నిర్మించనున్నారు. చిరంజీవికి, సుకుమార్కి రీసెంట్గా అడ్వాన్స్లు ఇచ్చేశారు నిర్మాతలు. సుకుమార్ స్టైల్ ప్రయోగాత్మకంగా కాకుండా మరోసారి రెగ్యులర్ యాక్షన్ డ్రామానే ఇంటెన్స్తో తెరకెక్కించనున్నాడు సుకుమార్. అయితే ఈ సినిమాతో చిరంజీవిని పూర్తిగా ఈ జనరేషన్ యూత్కి కనెక్ట్ అయ్యేలా ప్రజెంట్ చేయనున్నాడు సుకుమార్. ఒక వైపు సైరా నరసింహారెడ్డిని నెక్ట్స్ ఇయర్ సంక్రాంతి రిలీజ్కి ప్లాన్ చేస్తున్న చిరంజీవి…..సకుమార్ సినిమాను నెక్ట్స్ సమ్మర్ రిలీజ్కి రెడీ చేయాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారికంగా చెప్పనున్నారు మైత్రీ మూవీ మేకర్స్.