Saturday, May 18, 2024
- Advertisement -

దోశలు వేస్తూ.. తల్లిపై ప్రేమతో చిరు.. వీడియో వైరల్..!

- Advertisement -

ఈ మధ్య హీరోలు, దర్శకులు తమ ఇంటి పనులు చేస్తూ ఇతర హీరోలకు దర్శకులకు ఛాలెంజ్ లు విసురుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటివలే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చిరంజీవి తదితరులకు ఓ చాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన చిరంజీవి, తాను రోజూ ఈ పనులు చేస్తానని తెలిపారు.

“ఇదిగో భీమ్… నేను రోజూ చేసే పనులే… ఇవాళ మీ కోసం ఈ వీడియో సాక్ష్యం. నేను ఇప్పుడు కేటీఆర్ ను, నా స్నేహితుడు రజనీకాంత్ కు ‘బీ ది రియల్ మ్యాన్’ చాలెంజ్ ని విసురుతున్నాను” అంటూ ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక ఇందులో తన ఇంటి హాల్ ను వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేసిన చిరంజీవి, ఆపై వంటగదిలో దోశ వేశారు. దాన్ని తీసుకెళ్లి తన తల్లి అంజనాదేవికి తినిపించారు. అంజనాదేవి, ఓ దోశ ముక్కను “నేను తింటాలే… ముందు నువ్వు తిను” అంటూ బిడ్డకు తినిపించారు.

ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం “వకీల్ సాబ్”లోని “మగువా మగువా…” అన్న పాట వినిపిస్తోంది. ఈ వీడియో చూసిన వారు ఎంత ఎదిగిన తల్లికి ఆ కొడుకు ఎప్పుడు చిన్నప్పిల్లాడే అనే కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ కూడా చూసేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -