Tuesday, May 7, 2024
- Advertisement -

వైరల్:కేబీసీలో అమితాబ్‌తో చిరు

- Advertisement -

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపై సందడి చేయనున్నారు. దీనికి బుల్లితెర రియాల్టీ షో కౌన్ బనేగా క్రోర్‌పతి(KBC) వేదికకానుంది. అమితాబ్ హోస్ట్‌గా వస్తున్న కేబీసీ దేశవ్యాప్తంగా పాపులర్. ఈ షో ద్వారా ఇప్పటివరకు ఎంతోమంది లక్షాధికారులయ్యారు.

అయితే అప్పుడప్పుడు సినిమా సెలబ్రెటీలు పాల్గొనగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవే వెల్లడించారు. ఈ బర్త్ డే ఎంతో స్పెషల్. ఎందుకంటే నా ఇన్‌స్పిరేషన్ అయిన అమితాబ్ ని KBC షోలో ఈ రోజు నైట్ వర్చ్యువల్ గా కలుసుకోబోతున్నాను అంటూ పేర్కొన్నారు. ఈ షోలో ఇద్దరు అగ్రహీరోలు కలిసి ఏం మాట్లాడుకోబోతున్నారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గతంలో చిరు – అమితాబ్ కలిసి సైరాలో నటించారు. వీరిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. కేబీసీ తెలుగు వర్షన్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకి హోస్ట్ గా వ్యవహరించారు చిరు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇక అమితాబ్ ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్టు కేలో నటిస్తుండగా చిరు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -