అల్లు అర్జున్, రకుల్ ప్రీత్సింగ్, క్యాథరిన్ థెరెస్సా ముఖ్యతారలుగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం ‘సరైనోడు’. ఈ చిత్రం పాటల విజయోత్సవం ఆదివారం వైజాగ్లోని సముద్ర తీరంలో జరిగింది.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ, ‘‘వైజాగ్తో నాది ప్రత్యేక అనుబంధం.
రిటైరయ్యాక, వైజాగ్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటాను. ఇక, నాకు రామ్చరణ్ ఎలాగో బన్నీ కూడా అంతే. చిన్నతనం నుంచి సరదాగా డ్యాన్సులు వేసే బన్నీ కోసం ‘డాడీ’ సినిమాలో ఓ క్యారెక్టర్ సృష్టించి, అతని తెరంగేట్రానికి బీజం వేశానని గర్వంగా చెప్పుకుంటా. దర్శకుడు బోయపాటి శ్రీను నాకు ‘అన్నయ్య’ సినిమా టైమ్ నుంచి తెలుసు.
అతనిలో ఉన్న అంకిత భావమే ఈ స్థాయికి చేర్చింది. నాకు అంతకు ముందు ‘సింహా’, లెజెండ్’ కథలు చెప్పినప్పుడు ఏవో కొన్ని మార్పులు సూచించాను. కానీ ‘సరైనోడు’ కథ చెప్పినప్పుడు మారు మాట్లాడలేదు. ఈ చిత్రానికి అతను సరైన డెరైక్టర్’’ అని వ్యాఖ్యానించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ-‘‘ ఈ సినిమా మీ అంచనాలకు రీచ్ అవుతుందన్న నమ్మకం ఉన్నా దడగా ఉంది.
ఈ ఫంక్షన్ వైజాగ్లోనే ఎందుకు చేయాలనే దానికి కారణాలున్నాయి. మెగా ఫ్యామిలీ సినిమాలకు ఎన్నో రికార్డులను అందించింది. చిరంజీవిగారు ఏర్పరిచిన బాటలో ఇప్పుడు పవన్కల్యాణ్ నుంచి అల్లు శిరీష్ వరకూ అందరూ ప్రయాణిస్తున్నారు’’ అన్నారు. హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ-‘‘నాకెందుకో ఈ సినిమా పాటల వేడుక వైజాగ్లోనే చేయాలని మనసులో అనిపించింది. అలాగే జరిగింది. ఈ సినిమా కేవలం ఊర మాస్ సినిమానే కాదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా. ఈ సినిమాలో ఆది పినిశెట్టి పోషిస్తున్న విలన్ పాత్ర ఎంతగా నచ్చిందంటే, వేరే భాషల్లో ఈ కథను రీమేక్ చేస్తే నేను విలన్గా చేస్తానని చెప్పా’’ అన్నారు.
{youtube}v=tPOWaah_wF4{/youtube}