Sunday, April 28, 2024
- Advertisement -

సాయి పల్లవి క్రేజ్.. ఫిదా అయిన ముఖ్యమంత్రి కేసీఆర్

- Advertisement -

సాయి పల్లవి.. గత నాలుగు రోజుల నుంచి తెగ వినిపిస్తున్న పేరు.. మళయాళం ప్రేమమ్ సినిమాతో అదరి దృష్టి తనపై పడేలా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సాయి పల్లవి వెనక్కి తీరిగి చూసుకోలేదు. వరసబెట్టి ఆఫర్స్ ఆమెను వెత్తుకుంటూ వచ్చాయి. తెలుగులో వినూత్న దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో సాయి పల్లవి.. తెలుగులో అడుగుపెట్టింది. ఫస్ట్ సినిమాతో పెద్ద హిట్ అందుకుంది.

ఓ రెంజ్ బ్యూటీ కాకపోయిన.. కేవలం తన అభినయంతోనే సినిమాల్లో నటించి ప్రేక్షకులను తనవైపు తిప్పుకుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తెలుగు సరిగ్గా రాకున్న నేర్చుకొని మరి అందరిని ఫిదా చేసింది. కేవలం పల్లెటూరి వాతావరణంలో నడిచే ఫిదా సినిమాలో సాయిపల్లవి చేసిన నటనకు చాలా మంది ఫిదా అయిపోయారు. సాయి పల్లవికి అభిమానులు ఎంతోమంది డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఉన్నారు. ఫిదాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు ఇచ్చారు. సాయి పల్లవి నటనకు.. ఏకంగా ఒకేసారి పది సినిమాలు ఛాన్సులు వచ్చి పడ్డాయి.

దాంతో ఈ ముద్దుగుమ్మ తెగ సంతోష పడిపోతుంది. ఇక ఫిదాలో ఆమె చెప్పిన డైలాగ్స్ ను ఎంతో మంది మెచ్చుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రోజు ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలంగాణ సీఎం ‘ఫిదా’ సినిమా చూసి ఆయన ఫిదా అయిపోయారు. అద్భుతంగా ఉందని చెప్పారు. మూవీ యూనిట్ ని అభినందించారు. ముఖ్యంగా సాయి పల్లవి తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు కేసీఆర్ కు బాగా నచ్చయట. మంచి సినిమాలు తీసారు అని మూవీ యూనిట్ అభినందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -