Friday, March 29, 2024
- Advertisement -

బిగ్ బాస్ కి వెళ్లినందుకు గంగవ్వకు రూపాయి కూడా ఇవ్వలేదట..!

- Advertisement -

బిగ్ బాస్ నాలుగో సీజన్ లోకి వెళ్లి మంచి క్రేజ్ సంపాధించుకుంది గంగవ్వ. ఈమెపై ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ వినిపించాయి. అయితే అనరోగ్యం కారణంగా హౌస్ లో ఉండలేక 35రోజులకు బయటకు వచ్చింది. ఇక ఆమె రెమ్యునరేషన్ పై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చారు గంగవ్వ. 35రోజుల పాటు ఉన్న గంగవ్వకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు అనేది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 10 లక్షల వరకు ఆమెకు పారితోషికం ఇచ్చారని పుకార్లు వినిపించాయి.

అయితే అవి అబద్దాలే అని గంగవ్వ ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ లో ఉన్నందుకు గాను నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ వాళ్ళు కచ్చితంగా ఇస్తానని చెప్పారు. ఇల్లు లేదా మరొక విధంగా సహాయం చేస్తారని అనుకుంటున్నాను. నా ఊళ్ళోనే ఇల్లు కట్టిస్తాను అంటే నాకు ఇష్టమే అని చెప్పింది. ఇక గంగవ్వ క్లారిటీ ఇవ్వడంతో ఆమె రెమ్యునరేషన్ పై వస్తున్న వార్తలు అబద్దాలని తేలిపోయింది.

నాగార్జున గంగవ్వకు తప్పకుండా సహాయం చేస్తానని షో నుంచి బయటకు వెళ్లిపోయినప్పుడు మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల హౌజ్ నుంచి ఎలిమినెట్ అయిన కుమార్ సాయికి కూడా నాగ్ సహాయం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కుమార్ సాయి ఒక కథ చెబుతానని చెప్పడంతో నాగ్ తప్పకుండా వింటానని మాట ఇచ్చాడు. దీంతో ఇద్దరి కోరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్ ఎప్పుడు వారి డ్రీమ్స్ ని నెరవేరుస్తాడు అనేది చూడాలి.

కలర్ గురించి అవమానించారు : చాందిని

‘రంగ్ దే’ చిత్రం లో ‘ కీర్తిసురేష్‘ ప్రచార చిత్రం విడుదల

హీరో రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా..!

శంకర్ దాదా సక్సెస్.. హీరోలందరు కలిసిన వేళ.. ఫోటో వైరల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -