- Advertisement -
సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలు కూలీ, వార్ 2. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి కోరేందుకు రెడీ అయ్యారు నిర్మాతలు. అత్యాధునిక VFX, టాప్-క్లాస్ తారాగణం, విస్తృత విడుదలతో భారీ స్థాయిలో నిర్మితమైన ఈ రెండు సినిమాలు విడుదల తొలి రోజునుంచే బాక్సాఫీస్ వసూళ్లను గరిష్టంగా సాధించాలనే లక్ష్యంతో ఉన్నాయి.
టికెట్ రేట్ల పెంపునకు అనుమతి వస్తే నిర్మాతలకు రిలీఫ్ దక్కే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు ప్రేక్షకులను అలరించడం ఖాయంగా కనిపి్తోంది.
