టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్కు మేడ్చల్ కోర్ట్ 6 నెలలు జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…తెలుగు టాప్ హీరోలందరితో వర్క్ చేశారు డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్. తన డ్యాన్స్ స్టేప్పులతో అందరి దృష్టి తన మీద పడేలా చేసుకున్నాడు. తక్కువ కాలంలోనే తనకంటూ ప్ర త్యేక ఇమేజ్ క్రేయేట్ చేసుకున్న జానీ మాస్టర్ , మొదటి నుంచి ఏదో ఒక వివాదంలో ఉండటం పరిపాటిగా మారింది. జానీ మాస్టర్ మొదటి నుంచి మెగా అభిమాని. దీనిని చాలాసార్లు బయటికి వ్యక్తం చేశాడు కూడా. అయితే తన హీరోలను ఆకాశానికి ఎత్తేస్తు వేరో హీరోలను కించపరిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇంతకి జానీ మాస్టర్కు జైలు శిక్ష ఎందుకు పడిందని మీకు తెలుసా..? చెక్ బౌన్స్ విషయంలో కేసు మేడ్చల్ కోర్ట్ 6 నెలలు జైలు శిక్ష విధించింది. జానీ మాస్టర్ పై నాలుగేళ్ళ కిందట కేసు నమోదయ్యింది. 2015 లో చెక్ బౌన్స్ విషయంలో కేసు నమోదవ్వగా ఇప్పటికి కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. ఈ కేసులో జానీ మాస్టర్తో పాటు మరో నలుగురు వ్యక్తులకు కూడా శిక్ష పడినట్లు తెలుస్తోంది.మొదటి సెక్షన్ 354, 324, అలాగే 506 కింద కేసులు నమోదవ్వగా సెక్షన్ 354 కేసును కొట్టివేసి మిగతా కేసులు నిజమని నిర్దారించారు. అందుకు 6 నెలల శిక్ష విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్లో ఒక్కసారిగా అందరిని షాక్కి గురి చేసింది.
- Advertisement -
జానీ మాస్టర్కు 6 నెలలు జైలు శిక్ష
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -