బాలీవుడ్ హాట్ పెయిర్ దీపికా పడుకొనే, రణవీర్ సింగ్లు పెళ్లి చేసుకోబోతున్నసంగతి తెలిసిందే. వీరిద్దరు చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో చాలానే వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలపై ఎప్పుడు స్పందించలేదు ఈ జంట.సడన్ పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుని షాక్ ఇచ్చారు ఈ జంట.నవంబర్ 14, 15 తేదీల్లో వివాహం ఉంటుందని తెలిపారు. ఇటలీలోని లేక్ కోమోలో వీరి వివాహ వేడుక జరగనుంది.
పెళ్లికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఈ జంట ఇప్పుడు ఇటలీకి పయనమైంది. ఈరోజు ఉదయం ఇద్దరూ విడివిడిగా తెల్లని దుస్తుల్లో ముంబైలోని విమానాశ్రయానికి చేరుకున్నారు. సడెన్ గా దీపిక,రణవీర్ లు ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో అభిమానులు వారి చూట్టు గుమ్మిగూడారు. తమ కెమెరాల్లో దీపిక, రణవీర్ లను బంధించే ప్రయత్నం చేశారు.దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి తరువాత రిసెప్షన్ని ముంబైలో గ్రాండ్గా నిర్వహించాటానికి ప్లాన్ చేస్తున్నారు ఈ జంట.ఈ ఫంక్షన్కు బాలీవుడ్ తారలు మొత్తన్ని పిలవనున్నారని సమాచారం.