మెగా పవర్స్టార్ రామ్చరణ్ ప్రస్తుతం ‘ధృవ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. తమీళంలో సూపర్ హిట్ అయిన తనీ ఒరువన్ అనే సినిమాని చరణ్ తెలుగులో ‘ధృవ’ గా తీస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా చరణ్ సరసన రకుల్ ప్రితీ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా హైద్రాబాద్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమాలోని రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. స్టైలిష్ డిఫరెంట్ లుక్తో చరణ్ కనిపిస్తున్నాడు. దాంతో ‘ధృవ’ గురించి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ టాప్ సంగీత దర్శకుడు హిపాప్ తమిజా సంగీతం సమకూరుస్తోన్నారు. ఇక యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు ధృవ టీజర్ను సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్గా విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఈ టీజర్ లాంచ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ముఖ్య అతిధిగా రప్పించాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. మరి చెర్రీ కోసం బాబాయ్ వస్తాడో లేదో తెలియాలంటే…సెప్టెంబర్ 2 దాకా ఆగాల్సిందే.
Related