- Advertisement -
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ ప్లాప్ కావడం వల్ల ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలి అని చూస్తున్నాడు చెర్రీ. చరణ్ ప్రస్తుతం సూరేందర్ రెడ్డీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన థని ఒరువన్ సినిమాని తెలుగులో రిమేక్ చేస్తున్నాడు.
ఈ సినిమాకి తెలుగులో ధృవ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 6న విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ డేట్ ను దాదాపు లాక్ చేసినట్లు సమాచారం.
ఈ డేట్ కు తగ్గట్టే ఇప్పుడు అన్ని పనులు ముందుకు సాగుతున్నట్లు యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ధృవ ఫస్ట్ లుక్ ను ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు.
Related