ఇండియన్ నైటింగేల్ లతా మంగేష్కర్ అంత్యక్రియలను ముంబైలోని శివాజీ పార్కులో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమితాబ్ బచ్చన్ , సచిన్ టెండూల్కర్ వంటి ఎంతో మంది ప్రముఖులు లత పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
అయితే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా లత భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో షారుక్ ఆమె పార్థివ దేహం వద్ద ఉమ్మి వేశారని సోషల్ మీడియాలో ఒక వర్గం వారు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. షారుక్ ఖాన్ తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
కాగా దీనిపై షారుక్ ఫ్యాన్స్ కూడా ధీటుగా స్పందిస్తున్నారు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా ఇలా వ్యవహరించడం సరికాదని బదులిస్తున్నారు. ముస్లిం సంద్రదాయంలో ఎవరైనా మరణిస్తే వారి శవం వద్ద దువా చదువుతారు. అనంతరం అక్కడ గాలిని ఊదుతారు. షారుక్ ఖాన్ కూడా అదే చేశాడని.. దీనిని అర్థం చేసుకోకుండా ఉమ్మి వేశాడని విమర్శలు చేయడం సరికాదని హితవుపలుకుతున్నారు.