ఊ..అంటావా అంటూ పుష్ప సినిమాలో ఓ సాంగ్ తో ప్రేక్షకులను ఊరించిన సమంత.. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తాను ఏ పోస్ట్ పెట్టినా.. దానికి కొన్ని గంటల్లోనే లక్షల కొద్దీ లైకులు వచ్చి పడుతున్నాయి. తన లైఫ్ కు కనెక్ట్ అయ్యే కోట్స్ పెడుతూ.. అభిమానులను ఆలోచింపజేస్తూ ఉంటుంది. తాజాగా సామ్ పెట్టిన ఓ పోస్టు వైరల్ గా మారింది.
సమంత ప్రస్తుతం ‘యశోద’ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ‘శాకుంతలం’ తర్వాత సమంత చేస్తున్న మరో పాన్ ఇండియా చిత్రమిది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యింది. యశోదలో మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. తాజాగా వీరిద్దరి ఫన్నీ మూమెంట్స్ కొన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది సమంత. ఈ క్రమంలోనే ఒక కోట్ను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది సమంత.
‘నేను మాట్లాడే ముందు ఆలోచించడం నాకు ఇష్టం ఉండదు అంటూ ఆమె పెట్టిన కోట్ అభిమానులను బాగా ఆకర్షిస్తోంది. మిగతా వారిలాగానే నా నోటి నుండి వచ్చే మాటలకు నేను కూడా సర్ప్రైజ్ అవ్వడం నాకు ఇష్టం అంటూ సమంత షేర్ చేసిన ఈ కోట్ చాలా మందికి తెగ నచ్చేస్తోంది.
మాఫియా క్వీన్ గా బాలీవుడ్ చిన్నది