ఎవడు తీస్తే సినిమా హిట్ కొడుతుందో…అతడే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పూరీ తెరకెక్కిస్తున్న చిత్రం లైగర్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.’లైగర్’ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ రికార్డ్ స్థాయిలో అమ్ముడైనట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్జ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 60 కోట్ల రూపాయలకు ‘లైగర్’ సినిమాకు సంబంధించిన అన్ని భారతీయ భాషల డిజిటల్ రైట్స్ను అమెజాన్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే పూరి, విజయ్ల కెరీర్లో ఇదే రికార్డ్ స్థాయిలో కుదిరిన డీల్ అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి.
ఈ సినిమాను మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా పూరి రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా 5 భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది. అనన్య పాండే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.
భారీ ధర పలికిన రాధేశ్యామ్ డిజిటల్ శాటిలైట్ హక్కులు