మిర్చితో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ.. అనతి కాలంలోనే మంచి దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు. ప్రతి సినిమాలోనే ఏదో ఒక సామాజిక అంశాన్ని, సందేశాన్ని ఇస్తూ వెళ్తున్నాడు కొరటాల. మిర్చి, జనతాగ్యారేజ్, శ్రీమంతుడు, భరత్అనే నేను ఇలా అన్ని సినిమాల్లోనే తన మార్కును చూపించాడు. ఇక ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే కొరటాల శివ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్టు ప్రకటించాడు. తాను మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులకు సమాచారం అందిస్తూ టచ్లో ఉంటానని చెప్పాడు.
ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. ‘ నేను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నాను. కానీ ఎప్పటికప్పుడు నాకు సంబంధించిన విషయాలను అభిమానులకు చెబుతూనే ఉంటాను. మీడియా మారుతుందే తప్ప.. మన మధ్య ఉండే అనుబంధం మారదు’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. కేవలం 10 చిత్రాలను మాత్రమే తెరకెక్కించి ఆ తర్వాత .. సినిమాల నుంచి తప్పుకోవాలని కొరటాల శివ నిర్ణయం తీసుకున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అతడు నిర్మాతగా మారబోతున్నడని టాక్ నడిచింది.
ప్రస్తుతం దర్శక నిర్మాతలు, నటీనటులు తమ సినిమా ప్రమోషన్ల కోసం సోషల్ మీడియానే వేదికగా చేసుకుంటున్నారు. కానీ కొరటాల శివ మాత్రం అందులోనుంచి బయటకు వచ్చేశాడు. అందుకు కారణం ఏమిటో కూడా చెప్పలేదు. ఈయనే కాదు హీరో శర్వానంద్ కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. కనీసం ఆయనకు స్మార్ట్ ఫోన్ కూడా వాడటం లేదు. కేవలం ఇన్ కమింగ్,అవుట్ గోయింగ్ కాల్స్ కోసం చిన్న మొబైల్ మాత్రమే వాడుతున్నాడు.
Also Read
బండ్ల గణేష్ స్పీచ్ మరోసారి వైరల్..!
సూపర్ స్టార్ రజిని ఫ్యాన్స్ కి షాక్.. నటనకు తలైవా గుడ్ బై..!