Saturday, April 27, 2024
- Advertisement -

బండ్ల గణేష్ స్పీచ్ మరోసారి వైరల్..!

- Advertisement -

సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా, విజయోత్సవ సభ అయినా.. కార్యక్రమం ఏదైనా అక్కడ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఉన్నాడంటే అందరూ ఆయనేం మాట్లాడతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆయన ఏ విషయమైనా సూటిగా మాట్లాడతారు. ఒక్కోసారి మితి మీరి ఉద్వేగానికి లోనై ఆయన మాట్లాడే మాటలు వైరల్ గా మారుతుంటాయి. పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్.. పవన్ సినీ కార్యక్రమాల్లో రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. ఆయన మాటలకు పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంటాయి.

ఇవాళ కూడా మా ఎన్నికల నేపథ్యంలో లోకల్, నాన్ లోకల్ ఇష్యూ పై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇవాళ మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ఆయన ప్యానల్ లోని సభ్యులు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ప్యానల్ లో ఓ సభ్యుడైన బండ్ల గణేష్ మాట్లాడారు. ‘ ప్రకాష్ రాజ్ ని చూసి కొన్ని వందల సార్లు ఇరిటేట్ అయ్యాను. కానీ కొన్ని లక్షల సార్లు ప్రేమించాను. ప్రకాష్ రాజ్ తెలంగాణలోని మూడు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నాడు.

ఇక్కడ పుట్టిన టాలీవుడ్ హీరో ప్రభాస్ మొత్తం ఇండియన్ ఇండస్ట్రీని ఏలుతున్నాడు. అలాగే ఇక్కడే పుట్టిన రాజమౌళిని హాలీవుడ్ సినిమాలు చేయాలని అడుగుతున్నారు. ఇంకా లోకల్, నాన్ లోకల్ అంటూ ప్రస్తావన తేవడం ఏమిటని’ బండ్ల గణేష్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన కామెంట్ సోషల్ మీడియా సహా, సినీ వర్గాల్లోనూ సంచలనం సృష్టిస్తున్నాయి. లోకల్, నాన్ లోకల్ ఇష్యూ రావడంపై కాస్త ఆందోళనలో ఉన్న ప్రకాష్ రాజ్, ఆయన బృందానికి ఇవాళ బండ్ల గణేష్ స్పీచ్ జోష్ నింపింది.

Also Read

అన్న డైరెక్షన్లో తమ్ముడు హీరో..

రష్మిక కోసం ఏకంగా 900 కి.మీ ప్రయాణించిన అభిమాని…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -