Tuesday, April 30, 2024
- Advertisement -

మహేశ్ రాజమౌళి ప్రాజెక్ట్ ఒకే కావడానికి అసలు కారణం ఆదేనా?

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కేవలం తెలుగు సినిమాలతోనే నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాధించుకున్నారు మహేశ్ బాబు. ఇక పాన్ ఇండియా స్థాయిలో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళికి ఉండే క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ సెట్ కావడంతో పాన్ ఇండియా స్థాయిలో ఊహకందని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ గురించి అప్పుడప్పుడు రాజమౌళి రివిల్ చేస్తున్న అప్డేట్స్ మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి.

ఈ మూవీ పాన్ వరల్డ్ మూవీగా రాబోతుందని, ఇదొక యాక్షన్ అడ్వంచర్ మూవీ అని చెప్పి ఒక్కసారిగా అభిమానుల అంచనాలను రెట్టింపు చేశారు రాజమౌళి. దాంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సంగతి అలా ఉంచితే ఈ ప్రాజెక్ట్ గురించి కథ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. ప్రస్తుతం రాస్తున్న కథకు మహేశ్ బాబును హీరోగా ఎంచుకోవడానికి ఒక కారణం ఉందంటూ, మహేశ్ బాబు చాలా ఇంటెన్స్ ఉన్న యాక్టర్ అని, ముఖ్యంగా అతని యాక్షన్ సన్నివేశాలు చూస్తే అతనిలోని ఇంటెన్సిటీ ఇట్టే అర్థమౌతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

కథలోని ఎలాంటి పాత్రనైనా మహేశ్ చాలా ఈజీగా ఒన్ చేసుకుంటాడని చెప్తూ ప్రస్తుతం రాస్తున్న కథకు మహేశ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని భావించి రాజమౌళి మహేశ్ ను ఎంచుకున్నరని చెప్పుకొచ్చారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ఈ కథ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, ఇలాంటి ఫారెస్ట్ అడ్వంచర్ మూవీ చేయాలని రాజమౌళి ఎప్పటి నుంచో అనుకుంటున్నాడని ఫైనల్ గా ఇప్పుడు కుదిరించని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. మొత్తానికి మహేశ్ బాబు అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కాంబినేషన్ సెట్ కావడంతో.. ఈ ప్రాజెక్ట్ త్వరగా సెట్స్ పైకి వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

బాలయ్య ఒకే మరి చిరు ?

సలార్ విషయంలో కే‌జి‌ఎఫ్ ప్లాన్ !

బుచ్చిబాబుకు చరణ్ ఫ్యాన్స్ తో ఇబ్బందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -