Tuesday, May 21, 2024
- Advertisement -

చిరు 150 ఇష్యూః మెగాస్టార్‌పై మరోసారి పూరీ సెటైర్స్

- Advertisement -

కెరీర్‌లోనే ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోయే స్థాయి భారీ సినిమా తన చేతుల్లోకి వచ్చినట్టే వచ్చి జారిపోయిన వైనంపై ఇప్పటికీ పూరీకి కోపం తగ్గినట్టుగా లేదు. చిరంజీవి సినిమా కోసం గెస్ట్‌గా యాక్ట్ చేయడానికి అమితాబ్‌ని కూడా ఒప్పించాడు పూరీ. అయితే చిరంజీవి మాత్రం సడన్‌గా పూరీకి హ్యాండ్ ఇచ్చాడు. పైగా పూరీ కథ తనకు నచ్చలేదని మీడియా ముఖంగా చిరంజీవి చెప్పడం కూడా పూరీకి మరికాస్త కోపం తెప్పించింది. అప్పట్లోనే మీడియాతో మాట్లాడుతూ చిరంజీవిపై విమర్శలు చేశాడు పూరీ. ‘ఆటోజానీ’ ఇష్యూ అంతటితో సద్దుమణిగింది అనుకుంటే ఇప్పుడు మరోసారి చిరంజీవి 150పై సెటైర్స్ పేల్చాడు పూరీ.

తాజాగా మెహబూబా సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన పూరీ ఖైదీ నంబర్ 150 సినిమాలో ఉన్న ……‘పొగరు నా ఒంట్లో ఉంటది……హీరోయిజం నా ఇంట్లో ఉంటది’ డైలాగ్‌పై సెటైర్ పేల్చాడు. నేను డైరెక్టర్‌ని అని చెప్పి…….నా కొడుకే హీరో అన్న ఫీలింగ్‌తో….‘మా అబ్బాయి హీరో కదా….. దర్శకుడిని, నిర్మాతను నేనే కదా’ అనే తరహా సినిమాటిక్ పంచ్ డైలాగులు రాయలేదని సెటైరికల్‌గా చెప్పుకొచ్చాడు పూరీ. సినిమా కథకు ఏం డైలాగులు అవసరమో అవే రాశానని చెప్పాడు. ఇప్పుడు పూరీ మాట్లాడిన ఈ మాటలపైనే మెగాభిమానులు మండి పడుతున్నారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్‌పై సెటైర్స్ వేశాడు పూరీ. తాజాగా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాని దృష్టిలో పెట్టుకుని పూరీ మాట్లాడిన మాటలు మరోసారి మెగాభిమానులకు కోపాన్ని తెప్పించాయి. అయితే త్వరలోనే పూరీ మీడియా ముందుకు వచ్చి చిరంజీవి సినిమాను ఉద్ధేశ్యించి ఆ మాటలు అనలేదని వివరణ ఇవ్వనున్నాడని పూరీ సన్నిహితులు చెప్తున్నారు. మెహబూబా సినిమా ప్రమోషన్స్ కోసం మెగాస్టార్, పవర్ స్టార్, చరణ్, బన్నీల సాయం కూడా తీసుకోవాలనుకుంటున్నాడు పూరీ. పూరీ రిక్వెస్ట్‌కి మెగా హీరోల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -