అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్నైట్ స్టార్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ.ఈ సినిమా తరువాత విజయ్కు యూత్లో క్రేజ్ బాగా పెరిగింది.దీంతో విజయ్ నుంచి వచ్చే సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.తాజాగా విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం సూపర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా 100 క్లబ్లో చేరిందని ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఇక ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండకు డిమాండ్ పెరిగింది.దర్శక-నిర్మాతలు విజయ్ వెంటపడటం మొదలు పెట్టారు.తాజాగా మరో స్టార్ దర్శకుడు విజయ్తో సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
స్టార్ హీరోస్ అందరితో పనిచేసిన పూరి జగన్నాథ్ విజయ్తో ఓ సినిమా తీయడానికి సన్నహాలు చేస్తున్నడాని సమాచారం.ప్రస్తుతం వరస ప్లాప్లలో ఉన్న పూరితో సినిమాలు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు.దీంతో ఎలాగైనా విజయ్తో సినిమా ప్లాన్ చేసి హిట్ కొట్టి తనేంటో నిరుపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు పూరి.మరి స్టార్ హీరోలు సైతం పూరిని చూసి పారిపోతుంటే, విజయ్ దేవరకొండ పూరికి చాన్స్ ఇస్తాడా లేదో చూడాలి.