నితిన్ ప్రస్తుతం ఛలో సినిమా డెరెక్టర్ వెంకీ కుడుములతో భీష్మ అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వ్యవహారం బయటపడింది. ఈ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారట ఓ ముఠా. ఆ ముఠా ఓ వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి నితిన్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని మోసం చేస్తున్నారు. దీనిని నమ్మి పలువురు వారికి డబ్బులు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం చిత్ర యూనిట్కు తెలియడంతో దీనిపై స్పందించాడు దర్శకుడు వెంకీ కుడుముల. నితిన్ నేను కలిసి చేస్తోన్న సినిమాలో అవకాశం ఇస్తామంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు.
ఆ వాట్సాప్ గ్రూప్ తో చిత్రబృందానికి ఎలాంటి సంబంధం లేదని, డబ్బులు కట్టి మోసపోవద్దని ఆయన తెలిపారు.సినిమాలో కొత్తవారికి అవకాశాలు ఉంటే నేనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా మీకు తెలియజేస్తానని తెలిపారు. ఇలాంటి వారిని నమ్మి మోసపోద్దని వెంకీ కుడుముల విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదని తెలిపాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికను తీసుకునే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీ కుడుముల ఛలో సినిమాతో హీరోయిన్గా పరిచియం అయింది రష్మిక. ఆమెనే తన రెండో సినిమాకు కూడా తీసుకుందామని భావిస్తున్నాడట. హీరోయిన్ ఎంపికపై స్పష్టత రావాల్సి ఉంది.
- Advertisement -
నితిన్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి…
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -