Wednesday, May 1, 2024
- Advertisement -

హీరోయిన్ నేహా శెట్టి ఎమోషన్ పోస్ట్

- Advertisement -

చిన్న సినిమాగా విడుదలైనా హిట్ టాక్ సొంతం చేసుకున్న మూవీ డీజే టిల్లు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రొమాంటిక్ , కామెడీ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు జోరు కొనసాగిస్తోంది. హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ నేహా శెట్టి నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆనందాన్ని నేహా శెట్టి పూర్తిగా ఆస్వాదించలేకపోతోంది. అందుకు కారణం ఆమె ఇంట్లో విషాదం జరగడమే.

ఈ సందర్భంగా తనకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకుని నేహా భావోద్వేగానికి గురైంది. ‘‘నా అతి పెద్ద అభిమాని, స్ఫూర్తిప్రదాత, బామ్మను ఇటీవల కోల్పోయాను. నాకు రెండేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి.. నేను ఎక్కడ ప్రదర్శనలిచ్చినా మా బామ్మ ముందు వరుసలో కూర్చొని ప్రోత్సహిస్తూ ఉండేది. ఫిబ్రవరి 12వ తేదీ నా జీవితంలోనే ఎంతో ముఖ్యమైన రోజు. కానీ, నా విజయాన్ని చూసేందుకు ఆమె ఇప్పుడు నా పక్కన లేదని తెలిసి హృదయం ముక్కలైంది.

ఆమె ఆశీస్సులు ఎప్పటికీ నాపై ఉంటాయని భావించి కాస్త కుదుటపడ్డా. ఐ లవ్‌ యూ బామ్మ. డీజే టిల్లు విజయం నీకే అంకితం చేస్తున్నా. అలాగే మా ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌ చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు’’ అని నేహా తెలిపింది ‘డీజే టిల్లు’ విజయానికి రెండు రోజుల ముందు నేహా తన బామ్మని కోల్పోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -